మహబూబ్నగర్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ముసాపేట మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర నియోజక వర్గ యువత ఉపాధ్యక్షుడు రవితోపాటు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి వెంకటేశ్వర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, దేవరకద్ర నియోజకవర్గంలో ఏ పార్టీకి కనీసం కార్యకర్తలు కూడా లేని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల వల్ల లాభం లేదనే అభిప్రాయం అన్ని పార్టీల కార్యకర్తల్లో నెలకొందని ఆయన పేర్కొన్నారు.