హుస్నాబాద్, మే 19 : డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోళ్లు జోరు కొనసాగుతున్నాయి. ఒకవై పు కరోనా వైరస్, మరోవైపు లాక్డౌన్ ఉన్నప్పటికీ రైతులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనుగోళ్లను నిరాటంకంగా కొనసాగిస్తు న్నారు. దీంతో హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మ ద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఇప్పటి వరకు 7,34,103 క్విం టాళ్ల వడ్లు కొనుగోలు చేశారు. ఆరు మండలాల్లోని 13,221 మంది రైతులు ఆయా మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తాము పండించిన వడ్లు అమ్ముకున్నారు. డివిజన్లోని 108 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి.