నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 67 మంది ఎలిమేనేషన్ అయ్యారు. రాముల్ నాయక్ ఎలిమినేట్ అనంతరం.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 5252 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నకు 7352 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్కు 10,299 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్కు 1,22,638 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్న 99,210, కోదండరామ్ 89,409 ఓట్లతో తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి 23,428 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.