వరంగల్ అర్బన్ : కమలాపూర్ మండలంలోని కమలాపూర్, నేరెళ్ల, మాదన్నపేట గ్రామాలకు చెందిన 40మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి రవీందర్రావు, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, పింగిళి ప్రదీప్రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత