హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్పై శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప.. హత్యలుండవు అని గుత్తా అన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారు. ఉప ఎన్నికలో ఈటల ఓడిపోవడం ఖాయమన్నారు. మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంటుందన్నారు. 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయన్నారు. నియోజకవర్గాల డి-లిమిటేషన్ 2026లో పూర్తవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.