హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్భవన్లో ఆదివారం పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి.. సీజేఐకి పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ఎస్సార్ నగర్లోని జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్రావు కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, డీజీపీ ఎం మహేందర్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, తెలంగాణ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ హైకోర్టు ఉద్యోగుల సంఘం, తెలంగాణ జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ రావు, పాట్నా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) చైర్మన్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సీవీ సోమయాజులు, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్, జస్టిస్ యతిరాజులు, జస్టిస్ జీ భవానీప్రసాద్, జస్టిస్ వామనరావు, జస్టిస్ బీ భిక్షపతి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులు వేర్వేరుగా జస్టిస్ ఎన్వీ రమణను కలిసి అభినందనలు తెలిపారు.