లక్ష్మీపురంలో కూరగాయల మార్కెట్ ప్రారంభం
ఆధునిక హంగులతో సమీకృత మార్కెట్కు శంకుస్థాపన
కాశీబుగ్గ, ఏప్రిల్ 12 : వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో రూ.6.24కోట్లతో సకల హంగులతో నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే, మరో రూ.24 కోట్లతో అత్యాధునిక సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన నూతన మార్కెట్ను సందర్శించి, రిటైల్ వ్యాపారులతో మాట్లాడి, వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, మార్కెటింగ్శాఖ జేడీఎం మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజూనాయక్, డీఎంవో ప్రసాద్, కార్యదర్శి వెంకటేశ్, గ్రేడ్-2 కార్యదర్శులు ఓని కుమారస్వామి, తోట చందర్రావు తదతరులు పాల్గొన్నారు.
నర్సంపేట రోడ్డులోని లేబర్కాలనీ వందఫీట్ల రోడ్డు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీకేఎం కళాశాల నుంచి దేశాయిపేట మీదుగా లేబర్కాలనీ వరకు రూ.31.71కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్లో రూ.13కోట్లతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. లేబర్ కాలనీలనోని సీబీసీ చర్చి అభివృద్ధికి రూ.కోటి నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వస్కుల బాబు, బాషికే విజయ్కుమార్, జక్కం దాసు, పోలెపాక ప్రశాంత్, ముడుసు నరసింహా, కేతిరి రాజశేఖర్, స్టాలిన్, గోవింద్ పాల్గొన్నారు.
వెజ్, నాన్వెజ్ మార్కెట్కు శంకుస్థాపన
సుబేదారి : హన్మకొండ సర్కూట్ గెస్ట్హౌస్ రోడ్డులో రూ.4.5 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్: అక్కడ 10th, 12th పరీక్షలు వాయిదా
ఆ లైనప్ ఏంటి తారక్ .. ఎవర్నీ వదలవా..?