మేడ్చల్, మే 18 : రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తున్నదని అన్నారు. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కేసీఆర్ ఆసరాగ నిలుస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ కిట్ మొదలుకొని ఆసరా, ఒంటరి మహిళల పింఛన్ల్ల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహారెడ్డి, ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్రెడ్డి, డబిల్పూర్ సర్ప ంచ్ గీతాభాగ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
శామీర్పేట, మే 18: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం 24మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కష్టాల్లోనూ బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల బాగోగులు చూడటమే ప్రభుత్వ బాధ్యతగా ఈ చెక్కులను అందజేశామన్నారు. కేవలం రెండు-మూడు రోజుల్లోనే మేడ్చల్ నియోజకవర్గంలో400ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తుందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసం ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కరూపాయి ఖర్చు లేకుండా కరోనా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ పన్నాల వాణివీరారెడ్డి, కౌన్సిటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్రెడ్డి, రాణి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మేనేజర్ శ్రవణ్కుమార్, మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.