పెబ్బేరు, జూన్ 2: విన్నవించిన పది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పంపి ఓ ఆర్టీసీ ఉద్యోగికి ఊపిరిపోశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన గోనెల మన్యం ఆర్టీసీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. మన్యం కుమారుడు మల్లికార్జున్.. ఆరోగ్య సమస్యను వివరిస్తూ.. మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేవారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలని విన్నవించాడు. స్పందించిన కేటీఆర్ గంటల వ్యవధిలోనే ఆక్సిజన్ కాన్యన్ట్రేటర్ను మన్యం కుటుంబసభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సామాన్యుడి ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.