జగిత్యాల : రాజీయే రాజ మార్గమని జగిత్యాల జిల్లా అదనపు జడ్జి సుదర్శన్ అన్నారు. జగిత్యాల జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలోనే నేరాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. చేసిన తప్పు ఒప్పుకోవడనికి మించిన ప్రాయశ్చిత్తం లేదని తెలిపారు. కక్షిదారులు క్షమా గుణం కలిగి క్షమిస్తే చాలా కేసులు పరిష్కారం అవుతాయన్నారు. శనివారం జరిగిన లోక్ అదాలత్ సుమారు 351 క్రిమినల్ కేసులు, 12 సివిల్ కేసుల్లో జస్టిస్ సుదర్శన్ రాజీ కుదిర్చారు. బాధితుల కు రూ. 6,75,000 లక్షల నష్ట పరిహారం చెల్లింపులు జరిగాయి. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.