సిద్దిపేట అర్బన్, జూలై 3: సిద్దిపేట రూర ల్ మండలం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56, మాచాపూర్ గ్రామ పంచాయతీలోని హరీశ్నగర్లో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువు లో, మాచాపూర్ పంచాయతీ పరిధిలోని హరీశ్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించుకొని గృహ ప్రవేశాలు చేయ డం సంతోషంగా ఉన్నదన్నారు. లబ్ధిదారులు ఎంత ఆనందంగా ఉన్నారో, అంతకు రెట్టింపు సంతోషంతో సీఎం కేసీఆర్ ఉంటారన్నారు. ‘నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గ్రామం చల్లగా ఉండాలని, అన్నింటా ఆదర్శంగా ఉండాలి’ అని సీఎం కేసీఆర్ కోరుకున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.