జమ్మికుంటలో ఐక్యతను చాటిన పలు సంఘాలు
మంత్రి కొప్పుల ఈశ్వర్కు తీర్మాన ప్రతులు
జమ్మికుంట, జూలై 9: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ మద్దతని, కేసీఆర్ నాయకత్వాన్నే బలపరుస్తామంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన గుమస్తా, టైలర్, చిరువ్యాపారులు, టైల్స్ అండ్ మార్బుల్స్, పెయింటర్ల అసోసియేషన్లు, దాసరి కుల సంఘం స్పష్టంచేశాయి. శుక్రవారం ఏకగ్రీవ తీర్మాన ప్రతులను జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్కు అందజేశారు.
హుజూరాబాద్ అభివృద్ధిలో ఈటల విఫలం: మంత్రి గంగుల
హుజూరాబాద్: ఈటల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలోడబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి క్రాస్ రోడ్డులో గల డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈటల ముఖ్య అనుచరుడు రాపర్తి శివ శుక్రవారం మంత్రి గంగుల సమక్షంలో సొంతగూటికి చేరారు. బీజేపీలో ఇమడలేక ఆయన తిరిగి టీఆర్ఎస్లోకి వచ్చారు.