హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పాజిటివ్ రోగులకు టోసిలిజుమాబ్ డ్రగ్ కేటాయింపును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీలో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ (డీపీహెచ్) డాక్టర్ జి. శ్రీనివాస రావు ఉన్నారు. ఆస్పత్రుల నుండి టోసిలిజుమాబ్ కోసం డీఎంఈ అభ్యర్థనను స్వీకరించి కమిటీ ముందు ఉంచుతుంది. రోగి వారీగా పరిస్థితిని అంచనా వేసిన తరువాత ఆసుపత్రి నుండి ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యుల బృందం డ్రగ్ కోసం లేదా ఐసీయూకి సిఫార్సు చేస్తుంది.