హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా, సరుకుల రవాణాలో ఎటువంటి ఆటంకం జరుగకుండా నిత్యం పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో పౌరసరఫరాల శాఖ కమిషనర్, రవాణాశాఖ కమిషనర్, హైదరాబాద్ లేదా వరంగల్ ఐజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, హార్టికల్చర్, మార్కెటింగ్శాఖల డైరెక్టర్లు, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ ఇందులో సభ్యులుగా ఉంటారు.