వరంగల్ అర్బన్ : ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ ఎండ్ బీ గెస్ట్ హౌస్లో మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్దన్నపేట, వరంగల్ తూర్పు శాసనసభ్యులు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ లతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈనెల 21న సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. సీఎం 21న ఉదయం 10:30 గంటలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు భూమి పూజ, ఉదయం 11 గంటలకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం,11: 45 గంటలకు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలో పాల్గొంటారని షెడ్యూల్ ను వివరించారు.
అనంతరం యాదాద్రికి బయలుదేరి వెళ్లనున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా వున్నారని పేర్కొన్నారు.
లాక్డౌన్ ఉన్న కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ ల కన్నా ఎంజీఎం లో మెరుగైన సేవలు అందించామని తెలిపారు. వైద్య పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరంగలో లో నూతనంగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా 56 ఎకరాల 30 గుంటల్లో నిర్మిస్తున్నామని, 30 అంతస్తులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని అయన వివరాలను వెల్లడించారు.
జిల్లా లో జరుగుతున్న అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్, అర్బన్ రూరల్ జిల్లా లను వరంగల్, హన్మకొండ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే పేర్లతో కొనసాగించేందుకు వీలుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.