కాటారం తాసిల్దార్ ప్రత్యేక చొరవ
కాటారం, జూన్ 5: అచేతనస్థితిలో ఉన్న వ్యక్తి కార్యాలయానికి రాలేడని తెలిసి అతడి ఇంటి వద్దకే వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తాసిల్దార్ సునీత. కాటారం మండలం రేగులగూ డెం గ్రామానికి చెందిన గుడిపాటి అనంతరెడ్డికి గతంలో కరెంట్ షాక్ కొట్టడంతో నడవలేక మంచానికే పరిమితమయ్యాడు. తన తండ్రి మధుసూదన్రెడ్డికి చెందిన సర్వే నం. 116, 134లోని భూమి అనంతరెడ్డి పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉన్నది. అతడు కదల్లేని స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న తాసిల్దార్ శనివారం అనంతరెడ్డి ఇంటికి వెళ్లా రు. ఆపరేటర్ సహాయంతో కంప్యూటర్లో అతడి భూమి వివరాలు నమోదు చేసి అప్పటికప్పుడు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి కుటుంబ సభ్యులు తాసిల్దార్కు కృతజ్ఞతలు తెలిపారు.