గడువులోగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

సిద్దిపేట : త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్తో కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ నెల 29వ తేదీలోపు కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ లో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణ పనులను గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ నెల 29వ తేదీలోపు కలెక్టరేట్ కార్యాలయంలో శాఖల వారీగా ఫర్నీచర్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్అండ్ బీ ఈఈ సుదర్శన్ ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పద్మాకర్,ముజమ్మీల్ ఖాన్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహశీల్దార్ రామేశ్వర్, ఆర్అండ్ బీ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర అధికారిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్తో కొట్టి చంపిన తల్లి