ఒకప్పుడు అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాల్లో ఇప్పుడు అభివృద్ధి తళుక్కుమంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పల్లెల రూపురేఖలు మారాయి. జహీరాబాద్ మండల పరిధిలోని శేకాపూర్ తండాలో ప్రగతి పరుగులు తీస్తున్నది. గ్రామంలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు జిగేల్మంటున్నాయి. నూతనంగా నిర్మించిన డంపింగ్యార్డు, వైకుంఠధామాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. పచ్చని వాతావరణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతుండగా, నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. తండాలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిగిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్, మార్చి 17 : చుట్టూ అడవులు.. గుట్టలు.. ప్రకృతి అందాలు.. ఆ గిరిజన తండాకు ప్రజాప్రతినిధులు ఉండేవారు కాదు. తండాలో కారోబార్ పాలన సాగించే వారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధికి పెద్దపీట వేశారు. పల్లె ప్రగతిలో భాగంగా తండాల్లో అభివృద్ధి పనులు జరిగాయి. తండాకు మిషన్ భగీరథ నీరు.. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు ఏర్పాటు చేశారు. హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి ఇంటి ఎదుట మొక్కలు సంరక్షిస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని శేకాపూర్ తండా అభివృద్ధిలో ఆదర్శంగా మారింది.
శేకాపూర్ తండాలో అభివృద్ధి పనులు
శేకాపూర్ తండా గతంలో శేకాపూర్ పంచాయతీలో ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీగా ఏర్పాటు చేసి అభివృద్ధికి పెద్దపీట వేసింది. శేకాపూర్ తండాలో 110 ఇండ్లు ఉండగా, 523 జనాభా ఉంది. తండాలో 353 మంది ఓటర్లు ఉన్నారు. ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. 170 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉపాధి హామీలో 190 జాబ్ కార్డులు ఉండగా, ప్రతి కూలీకి పని కల్పిస్తున్నారు. తండాలో ప్రమాదకరంగా ఉన్న బావిని పూడ్చి వేశారు. 3 ఇండ్లును కూల్చివేశారు. తండాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లుకు మరమ్మతులు చేశారు. చెత్త సేకరణ చేసేందుకు రూ.6.90 లక్షలతో ట్రాక్టరు కొనుగోలు చేశారు. రూ.11లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ.1.50లక్షలతో పల్లెప్రకృతి వనం, రూ.1.26 లక్షలతో నర్సరీ పెంచుతున్నారు. ప్రధాన రోడ్డు నుంచి తండా వరకు ఇరువైపులా 650 మొక్కలు నాటారు.
తండాలో ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం..
తండాలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ప్రకృతి వనంలో మొక్కలు, పూల మొక్కలు, నాగలింగం, రుద్రాక్ష మొక్కలు పెంచుతున్నారు. పార్కులో ఆట వస్తువులను ఏర్పాటు చేశారు.
తండాలో చిగేల్ మంటున్న వీధిలైట్లు..
ప్రభుత్వ సహకారం, అధికారుల ప్రోత్సాహం, గ్రామస్తుల భాగస్వామ్యంతో తండా ఆదర్శంగా నిలుస్తున్నది. తండాలో వీధిదీపాల వెలుగుల్లో జిగేల్ మంటున్నది. పల్లె ప్రగతిలో విద్యుత్ స్తంభాలు వేశారు. విరిగిపోయిన, వంగిన స్తంభాలను తొలిగించారు. తండాలో ఎల్ఈడీ బల్బులను అమర్చారు.
చివరి మజిలీకి వైకుంఠధామం ఏర్పాటు..
తండాలో దహన సంస్కారాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం తండాలో రూ.11 లక్షలతో వైకుంఠధామం నిర్మించింది. తండా పక్కన గుట్టపై వైకుంఠధామం నిర్మాణం చేసి అందుబాటులోకి తెచ్చారు.
ప్రభుత్వ సహకారంతో తండా అభివృద్ధి
ప్రభుత్వ సహకారంతో శేకాపూర్ తండాలో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది తడి, పొడి చెత్తను చేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. వీధి దీపాలు జిగేల్ మం టున్నాయి. తండాలో వైకుంఠధా మం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించాం. తండాను చెత్త రహితగా తీర్చిదిద్దుతున్నాం.
-లాలీబాయి, సర్పంచ్, శేకాపూర్ తండా
పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం
‘పల్లె ప్రగతి’లో తండాలో ఉన్న సమస్యలు పరిష్కరించాం. పారిశుధ్య సిబ్బంది ప్రతి రోజు తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ప్రకృతి వనంలో మొక్కలు పెంచుతున్నాం. రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. పగటి పూటను తలపిస్తూ వీధిదీపాలు జిగేల్మంటున్నాయి. ప్రతి ఇంటికి మిషన్ భగరీథ నీరు సరఫరా చేసేందుకు పైపులైన్లు, ట్యాంకులు నిర్మాణం చేశారు. ఉపాధి హామీలో జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం.
-స్వరాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి
తండాలో మౌలిక సదుపాయాలు
ప్రభుత్వం తండాలో మౌలిక సదుపాయాలు కల్పించింది. గతంలో పంచాయతీ లేదు. శేకాపూర్ పంచాయతీలో ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తం డాను పంచాయతీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, హరితహారంలో మొక్కలు పెంచడంతో పచ్చదనం పెరిగింది. తాగునీటి సమస్యను పరిష్కరించారు.
-నాగ్, శేకాపూర్తండావాసి