ముంబై ,మే, 28: స్టాక్ మార్కెట్లు ఈ రోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 25,868.95 వద్ద, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 9,389.30 వద్ద ఉన్నాయి. ఇవాళ రెండిటి ట్రేడింగ్ మిశ్రమంగా ఉన్నది. వరుసగా ఆరో రోజు మార్కెట్ విస్తరించింది. బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 3 నెలల విరామం తర్వాత ఈ రోజు తాజా రికార్డును తాకింది.
నిఫ్టీ 50 అంతకుముందు రికార్డు స్థాయిలో 15,431.75 (ఫిబ్రవరిలో) ను అధిగమించింది . ఇంట్రాడే ట్రేడ్లో 15,455.55 గరిష్ట స్థాయిని తాకింది. బిఎస్ఇ సెన్సెక్స్ ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోలేదు, కానీ 290.71 పాయింట్లు పెరిగి 51,405.93 వద్ద నిలిచింది.