విద్యానగర్/నిజాంసాగర్/పిట్లం/ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయ సాధన దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్, గూడ అంజయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్, ఉపాధ్యక్షుడు పీతంబర్, గంగాప్రసాద్, నాగభూషణం, కార్యదర్శులు శేషారావు, చంద్రకాంత్, రవీందర్, రమేశ్ చైతన్య, నవీన్రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హన్మాండ్లుచారి, మాజీ అధ్యక్షుడు తానాజీ చారి తదితరులు పాల్గొన్నారు. పిట్లంలో విశ్వకర్మ సంఘం ఆధ్వ ర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళుల ర్పించారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దత్తాత్రేయ చారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీధర్చారి, సభ్యులు హన్మాండ్లుచారి, నర్సింహాచారి, వెంకటాచారి, వడ్ల సత్య నారాయణ, వడ్ల రమేశ్, దత్తు, ఆనంద్, నర్సింహులు, శ్రీను పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి చైర్మన్ కుడుముల సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్, మేనేజర్ వాసంతి, కౌన్సిలర్లు రాము, నీలకంఠం, సాయిలు, శ్రీను, నాయకులు ఇమ్రాన్, కార్యాలయ సిబ్బం ది పాల్గొన్నారు. మద్నూర్ గ్రామ పంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచ్ దరాస్ సూర్యకాంత్, ఉపసర్పంచ్ విఠల్, కార్యదర్శి సందీప్కుమార్, నాయకులు కుశాల్, గోపి, హన్మాండ్లు, సురేశ్, సిబ్బంది చంద్రకాంత్ పాల్గొన్నారు. లింగంపేటలో విశ్వకర్మ సంఘం సభ్యులు, టీజీవీపీ నాయకులు జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నయీం, నరహరి, భైరయ్య, వడ్ల భీమయ్య, రామ్చందర్, పండరి, వెంకటేశం, మురళి, లక్ష్మీనారాయణ, టీజీవీపీ సంఘ నాయకులు పాల్గొన్నారు.