నర్సాపూర్, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కు నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్లోని ఆమె నివాసంలో నర్సాపూర్ మున్సిపల్లోని జగన్నాధరావు కాలనీకి చెందిన గౌస్మియాకు రూ. 32వేల విలు వ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కును రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే సీఎంఆర్ఎఫ్తో నాణ్యమైన వైద్యం అందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు సత్యంగౌడ్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
నిజాంపేట, డిసెంబర్ 26: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుందని జడ్పీటీసీ పంజా విజయ్కుమార్ అన్నారు. సోమవారం నిజాంపేటలోని తన స్వగృహంలో జడ్పీటీసీ చల్మెడకు చెందిన శివయ్యకు రూ. 14,500, నార్లపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తంకు రూ. 38వేలు, శ్రీలతకు రూ. 30వేలు, నర్సింహులుకు రూ. 8,500 మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. వైద్య ఖర్చుల నిమిత్తం నిరుపేదలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డికి జడ్పీటీసీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో నార్లపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, చల్మె డ ఉపసర్పంచ్ రమేశ్ ఉన్నారు.