మెక్సికో సిటీ : మెక్సికో సరిహద్దు నగరమైన రియోనోసాలో జరిగిన దాడుల్లో 15 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం సిటీలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. అయితే స్థానికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారా? లేక యాధృచ్చికంగా జరిగాయా? అన్నది తేలాల్సి ఉంది. ఇద్దరు మహిళలను కారు ట్రంక్లో బందీలుగా చేసుకున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రియోనోసా మేయర్ మాకీ ఓర్టిజ్ స్పందిస్తూ.. దాడులు ఎందుకు జరిగాయన్న స్పష్టత లేదన్నారు. అయితే పౌరులకు రక్షణ కల్పిస్తామన్నారు.