ఝరాసంగం, మార్చి 13: మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకీ వనంలో వెలిసిన పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం తెల్లవారుజామున బసవేశ్వరుడి ఆలయం ముందు అగ్ని గుండంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి అగ్గిలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. అమావాస్య కలిసి రావడంతో వేలాది మం ది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గర్భ గుడిలోనున్న సంగమేశ్వర సమేత పార్వతి దేవతకు కుంకు మార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం, ఆకుపూజ, అన్నపూజలు భక్తులచే వేదపండితులు చేయించారు. ఆలయ మంటపంలో అర్చకులు రుద్రస్వాహాకార హోమం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశంగుప్తా, ఆలయ ఈవో మోహన్రెడ్డి, సర్పం చు బొగ్గుల జగదీశ్వర్, ఉప సర్పంచ్ మణమ్మ, ఎంపీటీసీలు రజినీప్రియ, విజేందర్రెడ్డి కేతకీ ఆలయ ధర్మక్తలు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగమేశ్వర్, టౌన్ అధ్యక్షుడు ఎజాజ్బాబా, అర్చకులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.
జడ్పీ చైర్పర్సన్ దంపతుల పూజులు
మహాశిరాత్రి నహ్నిక బ్రహ్మోత్సవాలు పురష్కరించుకుని శనివారం మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వస్వామిని దర్శించుకుని జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి దంపతులు గర్భగుడిలోని పార్వతి సమేత సంగమేశ్వరస్వామి వారికి ప్రత్యేకపూజలు, అర్చనలు, క్షీరాభిషేకం చేశారు. అం తకు ముందు ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. వారి వెంట ఆలయ చైర్మన్ వెంకటేశంగుప్తా, ఆలయ ఈవో మోహన్రెడ్డి, సర్పంచ్ జగదీశ్వర్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అర్చకులు ఉన్నారు
కమనీయం
పార్వతీ సంగమేశ్వరుల కల్యాణం
కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. కల్యాణంలో ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కల్యాణోత్సవానికి తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారా్రష్ట్ర ప్రాంతాల నుం చి భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్వతీ పరమేశ్వరుల కు అర్చకులు ఒడిబియ్యం, పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు బొగ్గుల జగదీశ్వర్, పరమేశ్వర్, ఉపసర్పంచ్ మాణేమ్మ, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీవో సుజాత, డీఎస్పీ శంకర్రాజు, ఎస్ఐలు ఎంపీటీసీలు రజనీప్రియ, విజేందర్రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.