టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ 19వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్కు ఎంపికైంది.
సూపర్ టాలెంటెడ్ కృతిశెట్టికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. కిశోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన రెడ్ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మరోవైపు తొలి సినిమా ఉప్పెనలో తన అందం, అభినయంతో చాలా మంది ప్రేక్షకులను సంపాదించుకుంది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుండటంతో కృతిశెట్టికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్.