హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్ట్ణణ ప్రగతి కార్యాక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం శనివారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కాన్ఫరెన్స్కు మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలు, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు హాజరవుతారు. పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చిస్తారు.