హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి నివాసంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అక్టోబర్ 2, 3వ తేదీలలో నిర్వహిస్తున్న బాక్స్ క్రికెట్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ క్రీడా హబ్గా రూపొందించేందుకు క్రీడా పాలసీని తయారు చేస్తున్నామన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈవెంట్ ఇండస్ట్రీ అధ్యక్షురాలు రాఖీ కనారియా, జాయింట్ సెక్రటరీ తౌఫిక్, ఆర్జే చేతన్, సౌరభ్ డగా, ప్రకాష్, షైనీ, నగేష్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!