హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షలను ఈ ఏడాది రెండు షిప్టుల్లో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో పరీక్షలు నిర్వహించాలని, అయితే రెండు షిప్లుల్లో ఒకే సబ్జెక్టుకు పరీక్ష నిర్వహించినా వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇస్తే బాగుంటుందని సూచించారు. జూలైలో పరీక్షలు నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు వెల్లడిస్తామని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటిస్తూ, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇటీవలే 12వ తరగతి వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ర్టాలు తమ ప్రతిపాదనలను రెండు, మూడు రోజుల్లో పంపాలని కోరారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ప్రతిపాదనలు పంపించారు.
ప్రాక్టికల్స్ వాయిదా
మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. జూన్ మొదటి వారంలో పరిస్థితులను సమీక్షించి, పరీక్షలకు 15 రోజులకు ముందు షెడ్యూల్ విడుదల చేస్తామని ఒమర్ జలీల్ స్పష్టం చేశారు.
ప్రతిపాదనలు ఇవీ..