హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న ఆయా పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్లో గెలిపించి హాట్రిక్’ సాధించిన తృణమూల్ కాంగెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఆయన అభినందించారు.
తమిళనాడులో డీఎంకే కూటమిని విజయతీరాలకు చేర్చి, పదేండ్ల విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుకు బాటలు వేసిన పార్టీ అధినేత పోరాట పటిమ అద్భుతమని పేర్కొన్నారు.
కేరళలో విజయాన్ని చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ కూటమికి అభినందనలు తెలిపారు. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకున్న సర్భానంద సోనోవాల్కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.