సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సతీమణి శోభ కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్ర్తాలు సమర్పించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్, సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.