హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): శివసత్తుల పూనకాలు.. పోతరాజుల నృత్యాలు.. డప్పు చప్పుళ్ల మధ్య లష్కర్ బోనమెత్తింది. ఆదివారం లష్కర్ బోనాల జాతర వైభవంగా కొనసాగింది. తెల్లవారుజామునుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి నగరంతోపాటు ఇతర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తల్లికి బోనాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటి స్తూ ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతర సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనం, పట్టు వస్ర్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఉన్నారు. మరోవైపు, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కరోనా నిబంధనలు పా టించేలా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.