హైదరాబాద్ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీరా చందూలాల్ మృతి పట్ల పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.
చందూలాల్ మృతి టీఆర్ఎస్ పార్టీతోపాటు గిరిజన జాతికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చందూలాల్ ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు.
తొలి గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కేసీఆర్ కేబినెట్లో పనిచేసి గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
చందూలాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి