యాదాద్రి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సాయంత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తున్నారు. ప్రధానాలయంలో పసిడి కాంతులు వెదజల్లేలా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శనలో భాగంగా అధునాతన విద్యుద్దీపాలంకరణ ట్రయల్ రన్ను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం పనుల పురోగతి, తదితర అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.