సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. సచివాలయ నిర్మాణ పనులను అక్కడున్న సిబ్బందిని అడిగి సీఎం తెలుసుకున్నారు.
రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విషయం విదితమే. రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు.
ప్రధాన గేట్ తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, అధికారులు తదితరులున్నారు. pic.twitter.com/SgdUEvmvuY
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. pic.twitter.com/YmcIWcnPa1
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021
తాజావార్తలు
- కమల్ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం