రాయ్పూర్: వయసు పెరిగినా వన్నె తరుగలేదని నిరూపించాడు సిక్సర్ల వీరుడు యువరాజ్సింగ్. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో భారత లెజెండ్స్ జట్టు 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కెప్టెన్ సచిన్ టెండూల్కర్(60) అర్ధసెంచరీకి తోడు యువరాజ్(22 బంతుల్లో 52 నాటౌట్, 2ఫోర్లు, 6సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ 20 ఓవర్లలో 204/3 స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 148/7 స్కోరుకే పరిమితమైంది.