నిజామాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ సందర్శించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఆర్మూర్లో సీఎం ఆగారు. ఈ సందర్భంగా నూతన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.
మెట్పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రేగుంట నుంచి సీఎం రోడ్డు మార్గాన హైదరాబాద్ బయల్దేరారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు.