నిత్యవ్యాయామంతో ఆరోగ్యం
మేయర్ వై సునీల్రావు
17వ డివిజన్లో ఓపెన్జిమ్ ప్రారంభం
జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి
కార్పొరేషన్, జూన్ 21: నగరవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఓపెన్జిమ్లను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ వై సునీల్రావు సూచించారు. 17 డివిజన్లో ఓపెన్ జిమ్ను సోమవారం ప్రారంభించారు. 10వ డివిజన్లో పర్యటించారు. మురుగు కాలువలను పరిశీలించారు. సమస్యలను పరిష్కరిస్తామని చెప్పా రు. ఆయాచోట్ల మేయర్ మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో మరో 30 ఓపెన్జిమ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను నిర్మిస్తు న్నామన్నారు. పనులను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. డివిజన్లలోని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తా మని పే ర్కొన్నారు. ఇందులో 17, 10 వ డివిజన్ల కార్పొరేటర్లు కోల భాగ్యలక్ష్మి, ఆనంద్, నాయకులు పాల్గొన్నారు.
సర్ జీవితం స్ఫూర్తిదాయకం..
తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితమిచ్చిన జయశంకర్ సర్ జీవితం స్ఫూర్తిదాయకమని మేయర్ పేర్కొన్నారు. జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నదని చెప్పారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతూ ఆయన కలలను సాకారం చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ , వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో ..
కమాన్చౌరస్తా: కిసాన్నగర్లో పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అరుదుగా ఉండే పంచముఖ హనుమాన్ మందిరాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల సరిత అశోక్, దాతలు పసుల మహిపాల్, చరణ్ పాల్గొన్నారు.