11న మెగా సమీక్ష

- మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
- రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, వైద్యం, అటవీ తదితర శాఖలపై సమీక్షలు
- పలు అంశాలపై కీలక నిర్ణయాలు
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలనే అంశంపై సోమవారం జరిగే సమీక్షలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. తెలంగాణకు హరితహారం అమలు, గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): పలు శాఖల్లోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 11వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్లో ఉదయం 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సమీక్షకు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, వైద్యారోగ్యం, అటవీ తదితర శాఖల ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. రెవెన్యూకు సంబంధించి పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రగతిభవన్లో సీనియర్ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో రెవెన్యూశాఖలో పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సోమవారం జరిగే సమావేశంలో పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్- బీలోని భూముల పరిష్కారం తదితర అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్నిఅంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.
వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ చర్చిస్తారు. కరోనా టీకాను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యక్రమంలో పౌరులకు వ్యాక్సిన్ వేయడానికి కార్యాచరణను రూపొందిస్తారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. గ్రామాలు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉన్నది? తదితర అంశాలపై చర్చిస్తారు.
తరగతులను ఎప్పుడు ప్రారంభిద్దాం?
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలనే అంశంపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఏ తరగతి నుంచి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణకు హరితహారం అమలుపై సమీక్షించడంతోపాటు, గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. సమావేశానికి కలెక్టర్లు, అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి