హుజూరాబాద్ : దళితబంధు పథకం లబ్ధిదారుతో సీఎం కేసీఆర్ ముచ్చటించిన విధానం సభలో, లైవ్ వీక్షించిన వారందరికీ ఆసక్తి కలిగించాయి. దళితబంధు లబ్ధిదారు, హుజూరాబాద్ రూరల్ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ, ఆమె భర్త మొగిలికి బెనిఫిషరీ కార్డు అందజేస్తూ సీఎం కేసీఆర్ ముచ్చటించారు.
ఈ పది లక్షలతో ఏం చేస్తవని రాధను కేసీఆర్ అడగ్గా.. డెయిరీ (పాల వ్యాపారం) పెట్టుకుంటానని బదులిచ్చింది. పాలు అమ్ముతవా? మంచిగా అమ్ముతవా? పక్కా మాట కదా అని సీఎం సరదాగా సంభాషించారు. మళ్లొచ్చిన్నాడు మీ ఇంటి కాడ ఛాయ్ పొయ్యాలే అని కేసీఆర్ అడిగిన వెంటనే ఆమె చిరునవ్వుతో సరేనని తలూపింది. ఈ సంభాషణ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.