బిచ్కుంద, మార్చి 21: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన వరుణ్ అండర్-14 అండర్ ఆర్మ్ భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల గోవాలో జరిగిన నేషనల్ అండర్ ఆర్మ్ క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబర్చడంతో ఇండియా జట్టుకు ఎంపిక చేశారు. ఏప్రిల్ నెలలో దుబాయ్లో జరగనున్న ఇంటర్నేషనల్ అండర్ ఆర్మ్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా జట్టు తరపున పాల్గొంటాడని వరుణ్ చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపయ్య తెలిపారు. కోచ్ బస్వరాజ్, కరస్పాండెంట్ అనిల్ ప్రత్యేక చొరవతో వరుణ్ నేషనల్ టీమ్కు ఎంపిక కావడం గర్వకారణమన్నారు.