తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 6: మండలంలోని రైతులు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మంగళవా రం కొండపోచమ్మసాగర్ నుంచి వర్గల్ మండలం హంసాన్పల్లి వద్ద సీఎం కేసీఆర్ హల్దీవాగులోకి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ ఆధ్వర్యంలో యావాపూర్, కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, నాగులపల్లి వెంకటత్నాపూర్ గ్రామాల రైతులు తరలివెళ్లారు. హల్దీవాగు నీరు మెదక్ జిల్లా యావాపూర్కు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సం తోశ్రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ లక్ష్మీస్వామి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఆధ్వర్యంలో పట్టణ కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్, శ్రీశైలంగౌడ్, మామిండ్ల జ్యోతికృష్ణ, ఉమాసత్యలింగం, రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమ్మరి రఘుపతి, ఉపేందర్, కృష్ణారెడ్డి, వెంకట్గౌడ్, రైతులు తరలివెళ్లారు.
రెండు రోజుల్లో పండుగ జరుపుకొందాం
హల్దీవాగు నుంచి సాగునీరు యావాపూర్ చెక్డ్యాంలోకి రెండు రోజుల్లో వస్తున్నదని, అదే రోజు రైతులతో పండుగను జరుపుకొంటామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి అన్నారు. నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్, ప్రత్యేక చొరవ చూపించిన మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లిన నేతలు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్ అధ్వర్యంలో నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన వారిలో మం డల సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ పురం నవనీత, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తూప్రాన్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, నర్సయ్య, శ్రీహరి తదితరులు ఉన్నారు.