హైదరాబాద్ : తెలంగాణ వక్ఫ్ బోర్డు తరఫున 2,500 రంజాన్ రేషన్ కిట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శనివారం పంపిణీ చేశారు. నాంపల్లిలోని హజ్ హౌస్ వద్ద సంబంధిత వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో తెలంగాణ ప్రభుత్వం పేద, అర్హులైన కుటుంబాలకు రేషన్ కిట్లతో పాటు బట్టలు పంపిణీ చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నివారించడానికి తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకుంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ రాష్ట్రంలో అన్ని రకాల సమావేశాలను నిషేధించారు. అందుకే స్థానిక మసీదులలో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్ మెరాజ్, కౌసర్ మోహినుద్దిన్, అబ్దుల్ ముకిత్ చందా తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు మంత్రి మహమూద్ అలీ 50 మంది నిరుపేదలకు రేషన్ కిట్లను బంజారా హిల్స్లోని తన అధికారిక నివాసంలో పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది