ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశముఖ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు అధికార వర్గాలు ఈ సంగతి వెల్లడించాయి. దేశముఖ్ పై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. ఈ దరిమిలా దేశముఖ్ను, ఇతరులను ఈడీ ప్రశించేందుకు పిలవొచ్చని అంటున్నారు. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన లంచగొండి ఆరోపణల ఆధారంగా ఈ కేసు ముందుకు వచ్చింది.