శ్రీశైలం : ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి పూర్తిగా నశించిపోయి అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ఆశిస్తూ శ్రీశైల దేవస్థానంలో శీతలాదేవి ప్రత్యేక హోమాన్ని శనివారం నుండి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. లోకశాంతిని కాంక్షిస్తూ 21 రోజులపాటు శీతలాదేవి అమ్మవారికి జరిపించే ప్రత్యేక హోమంను గణపతి పూజతో ప్రారంభించి మహా సంకల్పాన్ని పఠింపజేసి సాయంత్రం ప్రదోషకాల సమయంలో హోమక్రతువులను అర్చక వేదపండితులు ఏకాంతగా నిర్వహిస్తారని ఆయన చెప్పారు.