నల్లగొండ : హాలియాలో జరిగిన నిన్నటి సీఎం కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. హాలియాలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ఇంచార్జి, తక్కెలపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, మల్లయ్య యాదవ్. సైదిరెడ్డి, జాజుల సురేందర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
సభను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయ్. సీఎం కేసీఆర్ సభ మా క్యాడర్లో జోష్ ను నింపిందని మంత్రి పేర్కొన్నారు. జానారెడ్డి పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉన్నది. మొదటి నుంచి జానారెడ్డి ఎవ్వరికి అర్థం కారు. ఆయన మాటలు కూడా ఎవరికి అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. నాకు పదవులు అక్కరలేదు,, నాకోసం పోటీ చేయడం లేదు అంటూ పెద్దరికం మాటున జానారెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.
జానారెడ్డి మాటల్లో ,చేతల్లో డొల్లతనం బయటపడుతున్నది. ప్రజలకు అన్ని తెలుసు. జానారెడ్డి సేవలు ఇక చాలు అని 2018లోనే జానారెడ్డి ని ఇంటికి పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జానారెడ్డి ఓడిపోయి ఇంటికి పోవాల్సిందే. ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వారంతా టీఆర్ఎస్ కు అండగా ఉన్నారన్నారు.
ఇక బీజేపీ పార్టీ కి డిపాజిట్ కూడా రాదు. ఈ ఎన్నికల్లో మోదీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించారు. ప్రభుత్వం సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీకి నూకలు చెల్లినయని తెలిపారు. ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ..నిన్నటి సీఎం సభలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరలి వచ్చి సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ సభకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. టీఆర్ఎస్కు అండగా ఉంటామని ప్రజలు మా వెంట నడిచారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. 2018 లో లాగానే ఈ ఉప ఎన్నికల్లో కూడా చారిత్రిక విజయాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్