హైదరాబాద్ : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సర్వే కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ర్ట వ్యాప్తంగా భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో 17 సర్వే కంపెనీల ప్రతినిధులతో నిన్న సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.
భూ వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా 95 శాతానికిపైగా భూముల రికార్డులను సరిచేశారు. వాటన్నింటినీ డిజిటలైజ్ చేశారు. ప్రజల చెంతకు భూ రికార్డులను చేర్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక భూముల విస్తీర్ణంలో ఇంచుజాగా కూడా తేడాలేకుండా తాజాగా డిజిటల్సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్లో రూ. 400 కోట్లు కూడా కేటాయించారు.