హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. యాసంగి వరి ధాన్యం సేకరణ, ఏర్పాట్ల తీరుపై సీఎం సమీక్షిస్తున్నారు. వర్షాకాలం సాగు కోసం వ్యవసాయ శాఖ సన్నద్ధతపై కేసీఆర్ చర్చిస్తున్నారు. దళితబంధు పథకం అమలు తీరుతెన్నులను కూడా సీఎం సమీక్షిస్తున్నారు.