అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2558 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 915832కు చేరింది. ప్రస్తుతం 14913 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7268కు పెరిగింది.