మాజీ ప్రధానిని స్మరించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను గుర్తుచేసుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన వంటి రంగాలలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టి, అమలుచేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ నరసింహారావు అవలంబించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్ఠపరిచిందని సీఎం కొనియాడారు. బహుభాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ఠసేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
తాజావార్తలు
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?