నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. జిల్లా నేతలు, మండలాల బాధ్యులు, అభ్యర్థి నోముల భగత్ సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. సీఎం సభకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభా నిర్వహణ కొనసాగుతుంది.