హుజూరాబాద్, అక్టోబర్ 21: అభివృద్ధి పనులు చేసేటోళ్లా! ముచ్చట్లు చెప్పెటోళ్లా? ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. గురువారం హుజూరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఈటల ఎవరికోసం రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్చేశారు. ఏడేండ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా దేశంలో మరే రాష్ట్రం అభివృద్ధి చెందలేదని గుర్తుచేశారు. పక్క రాష్ర్టాల ప్రజలు తెలంగాణను చూసి గర్వపడుతున్నారని, మన రాష్ట్రంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నారని వివరించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకైనా కేంద్రం జాతీయ హోదా ఇచ్చిం దా అని నిలదీశారు. బీసీ గణన చేయాలని డిమాండ్ వస్తున్నా, కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం, వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రెండుసార్లు మంత్రిగా ఉన్న ఈటల బీసీ భవనమైనా, కనీసం ముదిరాజ్ భవనమైనా కట్టించారా చెప్పాలని అడిగారు. టీఆర్ఎస్ లో ఎదిగి ఆస్తులు, అంతస్థులు, హోదా సం పాదించుకున్నా ఈటల, ఇప్పుడు అదే పార్టీ అధినేత కేసీఆర్పై విమర్శలు చేయడం ఆయ న విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.